Nara lokesh : నారా లోకేష్ కు సిఐడి నోటిస్లు స్పందించిన నాయస్థానం

Photo of author

By sri645

Share this article

రెడ్ బుక్ వ్యవహారంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి అధికారులు తమను వేధిస్తున్నారని నారా లోకేష్ యువగళంలో ఆరోపించారు. తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రెడ్ బుక్ అంశం తెరపైకి వచ్చింది.

రెడ్ బుక్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు సూచనల మేరకు సీఐడీ అధికారులు శుక్రవారం లోకేశ్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. తనకు నోటీసులు అందాయని సీఐడీ అధికారులకు లోకేష్ కూడా సమాధానమిచ్చారు. అయితే ఈ కేసు విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు జనవరి 9కి వాయిదా వేసింది.

కాగా, యువగళం పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని గతంలో నారా లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. తనను అడ్డుకున్న అధికారులు, నేతల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నారన్నారు. తమను ఇబ్బందులకు గురిచేసిన, అసౌకర్యానికి గురిచేసిన ప్రతి ఒక్కరినీ తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకుంటుదని హెచ్చరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటోందని నారా లోకేష్ విమర్శించారు. దీనిపై స్పందించిన కొందరు అధికారులు నారా లోకేష్‌పై ఫిర్యాదు చేశారు. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు పంపారు.