Guntur Kaaram : సినిమా విడుదలకు ముందే మహేష్ గుంటూరు కారం సంచలనం

Photo of author

By sri645

Share this article

చాలా కాలం తర్వాత మహేష్, Guntur Kaaram త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇంకా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, హైపర్ ఆది, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా..

Guntur Kaaram Mahesh Babu

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇంకా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, హైపర్ ఆది, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్ననే జరగాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల చిత్ర యూనిట్ ఈ వేడుకను వాయిదా వేసింది. దీంతో ట్రైలర్ విడుదల కూడా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా Guntur Kaaram ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. గుంటూరు కారం విడుదలకు ముందే ప్రీసేల్స్‌లో సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం USA ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు షోలతో చాలా లొకేషన్లలో రిలీజ్ అవుతుంది. ప్రీ-సేల్స్ పరంగా 500కే డాలర్లు వచ్చినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో బుకింగ్‌లు తెరవలేదని.. మంగళవారం ఆయా ప్రాంతాల్లో బుకింగ్‌లు ప్రారంభిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో గుంటూరు కారం హవా కొనసాగుతోంది.